ధోనికి మద్దతుగా కైఫ్‌.. రాహుల్‌ వద్దు!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సేవలు ఇంకా అవసరమనే అంటున్నాడు మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ధోని అవసరం ఉందనే విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్‌ గ్రహించాలంటూ కైఫ్‌ మద్దతుగా నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి అవకాశం ఇవ్వకపోతే అది చాలా పెద్ద తప్పిదం అవుతుందని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో భారత క్రికెట్‌ వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌పై ఆధారపడటం తగదన్నాడు. ప్రధాన వికెట్‌ పాత్రను రాహుల్‌కు అప్పగించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చోటు కల్పించి, రాహుల్‌ను బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా ఉపయోగించుకోవాలన్నాడు. (ధోనికి ఎలా చోటిస్తారు..?)